ETV Bharat / bharat

వివాహితపై గ్యాంగ్ రేప్.. బర్త్​డే పార్టీలో ముగ్గురు యువకులు వంతులవారీగా..

author img

By

Published : Dec 14, 2022, 1:37 PM IST

ఒడిశాలో ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేసి, చేసి కోర్టుకు తరలించారు.

Woman gang raped at birthday party in odisha
వివాహితపై గ్యాంగ్ రేప్

ఒడిశా భువనేశ్వర్​లో మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబరు11న జరిగిన ఈ ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను దేబాషిస్ ప్రధాన్, దీపక్ కుమార్ సేథీ, స్వాధీన్ కుమార్ నాయక్​లుగా గుర్తించారు.

Woman gang raped at birthday party in odisha
వివాహితపై గ్యాంగ్ రేప్​ కేసులో నిందితులు

పోలీసుల సమాచారం ప్రకారం.. డిసెంబర్ 11 సాయంత్రం దీపక్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. వేడుకలలో భాగంగా కేకలు వేస్తూ పెద్ద శబ్దాలు చేయటం వల్ల పక్కనే నివసిస్తున్న ఓ మహిళ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆమెపై ఆగ్రహించిన నిందితులు ముగ్గురూ మహిళను ఓ ఇంట్లోకి లాక్కెళ్లిపోయారు. తర్వాత వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు.

బాధితురాలు సహాయం అరవగా.. ఆమె కేకలు విన్న కొందరు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని నిందితుల బారి నుంచి మహిళను రక్షించారు. అయితే అక్కడి నుంచి వెళ్లే ముందు నిందితులు ముగ్గురూ బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. చివరకు పోలీసులను ఆశ్రయించిన మహిళ.. జరిగిన విషయాన్ని చెప్పింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.