12ఏళ్ల బాలికపై రేప్.. 27ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్.. మైనర్​పై నలుగురు కలిసి..

author img

By

Published : Aug 3, 2022, 12:07 PM IST

Updated : Aug 3, 2022, 7:01 PM IST

up rape case

UP rape accused arrest 27 years: అత్యాచార కేసులో నిందితుడిని 27ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఝార్ఖండ్​లో మైనర్​పై నలుగురు దుండగులు గ్యాంగ్​రేప్​ చేశారు. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

UP crime news: అత్యాచారం జరిగిన 27ఏళ్లకు నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ షాజహన్​పుర్​లో జరిగింది. 12ఏళ్ల వయసులోనే బాధితురాలు అత్యాచారానికి గురైంది. ఆమె ఇంటికి పొరుగున ఉండే నకి హసన్, మహమ్మద్ రాజి అలియాస్ గుడ్డు అనే ఇద్దరు సోదరులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అయి.. ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై 27ఏళ్ల క్రితమే బాధితురాలు కేసు పెట్టారు. నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం, వారి డీఎన్ఏ వివరాలు సేకరించారు. గుడ్డు డీఎన్ఏ.. బాధితురాలికి పుట్టిన బిడ్డ డీఎన్ఏతో సరిపోలింది. అయితే, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సదర్ బజార్ పోలీస్ స్టేషన్​ 27ఏళ్ల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.

Football player Gangrape Jharkhand: మరోవైపు, ఫుట్​బాల్ మ్యాచ్ ఆడి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన మైనర్​పై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఝార్ఖండ్​లో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక ఝార్ఖండ్​లోని ఖార్సిదాగ్ ఓపీ ప్రాంతంలో నివసిస్తోంది. ఒడిశాలో ఫుట్​బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. మ్యాచ్ అనంతరం తిరిగి ఇంటికి బయల్దేరిన బాలిక సోమవారం సాయంత్రం ఝార్ఖండ్​కు వచ్చింది. బాల్​సిరింగ్ రైల్వే స్టేషన్​కు చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకుంది.

ఈ క్రమంలో ముగ్గురు దుండగులు ఆటో ఎక్కారు. బాలికను వేధింపులకు గురి చేశారు. బాలిక ప్రతిఘటించేసరికి.. చంపేస్తామంటూ ఆయుధాలు చూపించి బెదిరించారు. అదే ఆటోలో బాలికను దాశ్రమ్​ఫాల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై భౌతికంగానూ దాడి చేశారు. మంగళవారం ఉదయం బాలికను అడవి నుంచి బయటకు తీసుకొచ్చి దస్మైల్ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమె స్టేట్​మెంట్ రికార్డు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.

Last Updated :Aug 3, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.