కొద్దిరోజుల్లో ఎన్నికలు- భారీగా మద్యం, గంజాయి పట్టివేత

author img

By

Published : Jan 13, 2022, 6:51 AM IST

up election 2022

UP Election 2022: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్​ప్రదేశ్​లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ.2.5కోట్లు విలువ చేసే గంజాయిని సీజ్​ చేశారు.

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల వేళ భారీగా మద్యం, మాదకద్రవ్యాలను సీజ్​ చేశారు అధికారులు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిననాటి నుంచి రూ.1.45కోట్ల విలువైన 73 వేల లీటర్ల మద్యం, రూ.2.5కోట్ల విలువైన 1,825 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు.

యూపీ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్​, గోవాలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: యూపీలో మరో మంత్రి రాజీనామా.. భాజపాలోకి ఎస్​పీ నేతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.