ETV Bharat / bharat

కారు ఆపిన పోలీసులపై బాంబు దాడి.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి

author img

By

Published : Aug 1, 2023, 10:47 AM IST

Updated : Aug 1, 2023, 12:05 PM IST

Tamil nadu Police Encounter : తమిళనాడులో కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. మరో ఇద్దరు ఘటనాస్థలి నుంచి తప్పించుకున్నారు. నిందితుల దాడిలో గాయపడ్డ సబ్​ ఇన్​స్పెక్టర్​ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tamilnadu Police Encounter
Tamilnadu Police Encounter

Tamil nadu Police Encounter : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో కాల్పులు కలకలం రేపాయి. గుడువంచేరీ వద్ద పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. మరో ఇద్దరు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ఎస్​ఐ గాయపడ్డారని పేర్కొన్నారు. మృతులు పలు హత్య కేసుల్లో నిందితులని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంబరం పోలీస్​ స్టేషన్ పరిధిలో గుడువంచేరీలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇన్​స్పెక్టర్​ మురుగేషన్ నేతృత్వంలోని పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. తనిఖీ నిమిత్తం ఒక నల్ల రంగు స్కోడా ఎస్‌యూవీ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తమ వాహనాన్ని ఆపకపోగా.. పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టారు. అంతే కాకుండా వేట కొడవళ్లతో పోలీసులపై దాడి చేశారు. వారి దగ్గరున్న బాంబును పోలీసులపైకి విసిరారు. అయితే, నిందితులు దాడి చేయడం వల్ల.. పోలీసులు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని.. వారిని వెంటనే దగ్గల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అనంతరం నిందితులిద్దరూ మరణించినట్లు తెలిపారు.

నిందితుల దాడిలో గాయపడ్డ సబ్​ ఇన్​స్పెక్టర్​ శివ గురునాథన్​ను చికిత్స నిమిత్తం క్రోమ్​పేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని, ఎస్​ఐ చికిత్స పొందుతున్న ఆస్పత్రిని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. మృతులను ఎస్ వినోద్ అలియాస్ చోటా వినోద్ (35), ఎస్ రమేష్ (32)గా గుర్తించారు. వారిపై మర్డర్​, హత్యాయత్నం, దోపిడీ వంటి అభియోగాలతో వినోద్​పై 50, రమేష్​పై 20కి పైగా కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

పోలీసులపై 500 మంది రాళ్ల దాడి..
ఈ ఏడాది జూన్​లో గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న ఓ ప్రార్థనా మందిరానికి మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన నోటీసులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రార్థనా మందిరం కూల్చివేతకు నోటీసులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులుతో పాటు పోలీసులు వెళ్లడం వల్ల అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఓ వర్గానికి చెందిన 500 నుంచి 600 మంది నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేసి.. అలాగే పలు వాహనాలకు నిప్పంటించారు. నిరసనకారుల దాడిలో ఓ పౌరుడు మరణించగా.. కొందరు పోలీసుల సైతం గాయపడ్డారు. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Aug 1, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.