ETV Bharat / bharat

'యువత భాగస్వామ్యంతోనే కశ్మీర్​లో ఉగ్రవాదానికి అడ్డుకట్ట'

author img

By

Published : Oct 24, 2021, 3:47 PM IST

జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) తెలిపారు. జమ్ముకశ్మీర్​ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఈ అభివృద్ధిలో యువత భాగమవ్వాలని, దాని ద్వారానే ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందన్నారు.

Amit Shah Kashmir Visit
జమ్ముకశ్మీర్​లో అమిత్ షా

జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah News) తెలిపారు. కశ్మీర్​, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. మూడు రోజుల జమ్ముకశ్మీర్‌ పర్యటనలో(Amit Shah Kashmir Visit) భాగంగా.. భగవతీ నగర్​ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

"జమ్మూ ప్రజలకు జరిగిన అన్యాయం ముగిసిపోయిందని చెప్పేందుకు నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీకు ఎవరూ అన్యాయం చేయలేరు. కొంతమంది ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఎవరూ దీన్ని అడ్డుకోలేరని నేను మీకు భరోసా ఇస్తున్నాను."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

ఇప్పటికే జమ్ముకశ్మీర్​లో 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. జమ్ముకశ్మీర్​ అభివృద్ధిలో యువత భాగమైతే.. ఉగ్రవాదుల వ్యూహం దెబ్బతింటుందని చెప్పారు.

జమ్ముకశ్మీర్(Amit Shah Kashmir Visit) పర్యటనలో భాగంగా.. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జమ్మూలో ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ మొక్క నాటారు. జమ్మూలో ఎంపీలు, భాజపా నేతలతో ఆయన భేటీ కానున్నారు. డిజియానాలో గురుద్వారాను సందర్శించనున్నారు.

సోమవారం కూడా హోం మంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటనను కొనసాగించనున్నారు. 2019లో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అమిత్‌ షా తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు'

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ భద్రతపై అమిత్​ షా సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.