కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించలేం.. అవినాష్​ పిటిషన్​ కొట్టివేత

author img

By

Published : Mar 17, 2023, 11:00 AM IST

Updated : Mar 17, 2023, 11:54 AM IST

mp avinash reddy

TELANGANA HIGH COURT DISMISSED THE AVINASH PETITION: కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్​ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కొట్టివేస్తూ.. దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

TELANGANA HIGH COURT DISMISSED THE AVINASH PETITION: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అవినాష్​పై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగివచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అవినాష్​ రెడ్డిని విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణ సమయంలో న్యాయవాదని అనుమతించాలన్న అవినాష్​ అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమన్న న్యాయస్థానం.. అవినాష్​ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని సీబీఐకి సూచించింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ చేస్తున్న దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాష్​ రెడ్డి ఈ నెల 9న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని.. సీబీఐ అధికారులు నమోదు చేసిన తన వాంగ్మూలం ప్రతికి తనకు ఇవ్వాలని పిటిషన్​ దాఖలు చేశారు. అంతే కాకుండా సీబీఐ విచారణ జరుపుతున్న సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే అవినాష్‌ రెడ్డి అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు.. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని హైకోర్టుకు వెల్లడించారు. అవినాష్​ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై ఈ నెల 13న వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఈరోజుకి వాయిదా వేసింది. ఈ పిటిషన్​పై తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ అధికారులను ఆదేశించింది.

మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే పలు సార్లు విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24, మూడో సారి మార్చి 14న హైదరాబాద్​లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. తాజాగా అవినాష్​ దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్​ను కొట్టివేస్తూ.. సీబీఐని దర్యాప్తు చేసుకోవాలని ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అవినాష్​ రెడ్డిని విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 17, 2023, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.