ప్రాణాలు తీసిన పరోటా- ఆ తల్లీకూతుళ్లకు ఏమైంది?

author img

By

Published : Oct 14, 2021, 11:49 AM IST

Mother and daughter dies after eating parotta

పరోటా తిని.. తల్లి, కూతురు మరణించారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఓ రెస్టారెంట్​లో పరోటా తిని.. తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేదారిలోనే ఆ ఇద్దరూ మరణించారు.

అసలేం జరిగిందంటే?

తూత్తుకుడిలోని కోవిల్​పట్టి తంగప్ప వీధికి చెందిన కర్పగం(33), ఆమె కుమార్తె దర్శిని అక్టోబరు 12న ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరూ.. పరోటా ఆర్డర్​ చేసి తిన్నారు. తర్వాత పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లి.. సాఫ్ట్​ డ్రింక్​ తాగారు. అనంతరం ఇంటికి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్నవారు.. ఒక్కసారిగా మూర్ఛపోయారు. అప్రమత్తమైన బంధవులు, స్థానికులు.. బాధితులిద్దరినీ కోవిల్​పట్టిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చేతులెత్తేసిన వైద్యులు.. తిరునెల్వేలి పాలయన్​కొట్టాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. అక్కడకు తీసుకెళ్తుండగా.. దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోస్టుమార్టం కోసం తిరిగి కోవిల్​పట్టి ఆస్పత్రికే తీసుకొచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కారు అద్దంలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.