ETV Bharat / bharat

ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది

author img

By

Published : Aug 17, 2022, 8:25 AM IST

Updated : Aug 17, 2022, 9:31 AM IST

Six people were found dead in a single house in Sudra area of Jammu this morning
Six people were found dead in a single house in Sudra area of Jammu this morning

08:21 August 17

ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది

ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టు ​మార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలు, ఆస్పత్రికి తరలించారు.
మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్​ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్​ ఉల్​ హబీబ్​, సాజిద్​ అహ్మద్​గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అనుమానస్పద మరణాలకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.

ఒకే కుటుంబంలో ఐదుగురు.. మహారాష్ట్ర పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అహ్మద్​నగర్​-పుణె జాతీయ రహదారిపై రాజ్​నందగావ్​ వద్ద ఓ కారు.. రాంగ్​ రూట్​లో వస్తున్న కంటైనర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్​ డ్రైవర్​ పరారీలో ఉన్నాడు.

ఇవీ చూడండి: గుజరాత్‌లో డ్రగ్స్ కలకలం, రూ.2వేల కోట్ల మత్తుపదార్థాలు సీజ్

ముంబయిలో స్వైన్ ఫ్లూ విజృంభణ, దిల్లీలో కరోనా విలయం

Last Updated :Aug 17, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.