ETV Bharat / bharat

అయోధ్యకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

author img

By

Published : May 29, 2022, 11:33 AM IST

Updated : May 29, 2022, 12:02 PM IST

UP accident: ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బహ్రైచ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

UP accident
UP accident

UP accident: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని మోతీపుర్ ప్రాంతంలోని లఖింపూర్-బహ్రైచ్ రాష్ట్ర రహదారిపై తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. కర్ణాటక నుంచి అయోధ్యకు భక్తులతో వెళ్తున్న కారు వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్‌తో సహా మృతి చెందిన ఏడుగురు యాత్రికుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కాగా 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రీరామ జన్మభూమికి పూజలు చేసేందుకు భక్తులంతా కర్ణాటక నుంచి అయోధ్యకు వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మోతీపుర్ పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలన్నింటినీ బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్'​ ప్లాన్​.. వర్కౌట్​ అయితే కనక వర్షమే!

Last Updated : May 29, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.