ETV Bharat / bharat

బస్​స్టాప్​లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం

author img

By

Published : Dec 4, 2022, 7:33 PM IST

Updated : Dec 4, 2022, 8:13 PM IST

మధ్యప్రదేశ్‌.. రత్లాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్​స్టాప్​లో ఉన్న ప్రయాణికులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో పదిమంది గాయపడ్డారు.

road accident in ratlam
రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌.. రత్లాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్​స్టాప్​లో ఉన్న ప్రయాణికులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో పదిమంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. కనీసం 20 మందిని ట్రక్కు ఢీకొట్టిందని సమాచారం.

Last Updated :Dec 4, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.