నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా రాజీవ్​ కుమార్​

author img

By

Published : May 12, 2022, 1:51 PM IST

Rajiv Kumar appointed next CEC, to assume charge on May 15

Rajiv Kumar CEC: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా.. రాజీవ్​ కుమార్​ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Rajiv Kumar CEC: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా(సీఈసీ).. రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Rajiv Kumar appointed next CEC, to assume charge on May 15
రాజీవ్​ కుమార్​
ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్‌ కుమార్ మే 15న పదవీ బాధ్యతలు చేపడతారు. ఏడాది వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 1984 బ్యాచ్‌ ఝార్ఖండ్​ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌.. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.

ఇవీ చూడండి: కుమారుడికి గుడి కట్టిన తల్లిదండ్రులు.. నిత్యం పూజలు చేస్తూ..!

ఇంజినీరింగ్ విద్యార్హతతో ఎస్​బీఐలో ఉద్యోగాలు.. 5 రోజులే గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.