ETV Bharat / bharat

Omicron India: ఆ దేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా ​

author img

By

Published : Dec 1, 2021, 1:11 PM IST

Omicron India News: కేంద్రం ప్రకటించిన రిస్క్​ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో నలుగురిలో వైరస్​ నిర్ధరణ అయ్యింది. వీరి నమూనాల్లో కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ఉండొచ్చనే అనుమానంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.

passengers from UK, Netherlands test positive for Covid
వైరస్​ పాజిటివ్​

Omicron India News: యూకే, నెదర్లాండ్స్​ నుంచి బుధవారం.. దిల్లీకి చేరుకున్న నలుగురు ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకుగానూ వారి నుంచి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఆమ్‌స్టర్‌డామ్, లండన్ నుంచి మొత్తంగా నాలుగు విమానాల్లో 1,013 మంది ప్రయాణికులు దిల్లీకి చేరుకోగా.. వారిలో నలుగురికి కొవిడ్​ పాజిటివ్​గా తేలిందని స్పష్టం చేశారు.

ఈ నలుగురిని దిల్లీలోని ఎల్​ఎన్​జేపీ ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా రోగులతో కలవకుండా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్​ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్​ సోకిన నలుగురు భారతీయులేనని అధికారులు తెలిపారు.

యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్​, ఇజ్రాయెల్‌లతో పాటు మరికొన్ని ఐరోపా దేశాలను కేంద్రం 'ఎట్​ రిస్క్' ​కంట్రీస్​గా గుర్తించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులు భారత్​కు చేరుకుంటే.. కేంద్రం సూచించిన అదనపు జాగ్రత్తలను పాటించాలి.

కొత్త నిబంధనల ప్రకారం.. 'ఎట్​ రిస్క్​' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. ఫలితం వచ్చే వరకు వారు విమానాశ్రయం వదిలి పెట్టకూడదని షరతు విధించింది.

ఇదీ చూడండి: Omicron In India: ఆ దేశ ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.