నక్సలైట్ల చేతికి ఆటోమేటిక్​ వెపన్స్​.. పాక్​-చైనాలతో సంబంధాలు!

author img

By

Published : Jan 13, 2022, 10:55 AM IST

Updated : Jan 13, 2022, 11:51 AM IST

Naxalite weapons

Naxalite weapons: నక్సలైట్లు అత్యాధునిక ఆయుధాలు, ఆటోమేటిక్​గా పని చేసే రైఫిళ్లను సమకూర్చుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు ఝార్ఖండ్​ పోలీసులు. ఇటీవల పట్టుబడిన నిషేధిత పీఎల్​ఎఫ్​ఐకి చెందిన ఓ నక్సలైట్​ ఫోన్​లో కీలక ఆధారాలు లభించినట్లు చెప్పారు. అతని ఫోన్​లో ఇప్పటి వరకు భారత్​లో ఉపయోగించని స్విస్​ రైఫిల్ ఫొటోలు​ ఉండటం గమనార్హం.

Naxalite weapons: నక్సలైట్లు ఆటోమేటిక్​ రైఫిళ్లు, ఇతర అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఝార్ఖండ్​లో పట్టుబడిన ఓ నక్సలైట్​ ఫోన్​లో ఆటోమేటిక్​గా పని చేసే అత్యాధునిక ఆయుధాల చిత్రాలు ఉండటం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది. నిషేధిత నక్సలైట్​ ఆర్గనైజేషన్​ పీపుల్స్​ లిబరేషన్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియాకు(పీఎల్​ఎఫ్​ఐ) చెందిన ఓ నక్సలైట్​ ఫోన్​లో ఈ ఆయుధాల చిత్రాలు లభించినట్లు ఝార్ఖండ్​ పోలీసులు తెలిపారు. వారికి చైనా, పాకిస్థాన్​ల నుంచి సాయం అందుతుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

జనవరి 10న బిహార్​లోని బక్సర్​ జిల్లా ఇండస్ట్రీయల్​ పోలీస్​ స్టేషన్​ ప్రాంతంలో జాతీయ రహదారి 84పై బంగాల్​ రిజిస్ట్రేషన్​ ఉన్న కారులో పీఎల్​ఎఫ్​ఐకి చెందిన నక్సలైట్లు వెళ్తున్నట్లు రాంచీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బక్సర్​ ఎస్పీ నీరజ్​ కుమార్​ సింగ్​కు సమాచారం ఇచ్చారు రాంచీ పోలీసులు. ఆయన ఆదేశాలతో బిహార్​-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దులోని వీర్​ కున్వార్​ సింగ్​ సేతూ వంతెన వద్ద తనిఖీలు చేపట్టారు. పీఎల్​ఎఫ్​ఐకి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల నగదు, 19 మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు ఓ మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు.

పీఎల్​ఎఫ్​ఐ సంస్థకు చెందిన అధినేత దినేశ్​ గోపికి ప్రత్యేక సహాయకుడు, రాంచీలోని ధుర్వకు చెందిన నివేశ్​ కుమార్​ అనే నక్సలైట్​ ఫోన్​లో ముఖ్యమైన ఆధారాలు, పలు ఆయుధాల చిత్రాలు లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో ఇప్పటి వరకు భారత్​లో ఉపయోగించని స్విస్​ రైఫిల్ ఫొటో ఉండటం మరింత అనుమానాలు రేపినట్లు చెప్పారు అధికారులు. పీఎల్​ఎఫ్​ఐ అధినేత దినేశ్​.. విదేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు తెలిసిందన్నారు.

దిల్లీ నుంచి ఝార్ఖండ్​కు వయా పూర్ణియా మీదుగా వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నివేశ్​ కుమార్​ నేపాల్​ వెళ్లేందుకు ఈ ప్రయాణం చేపట్టారన్నారు. నేపాల్​లోని అక్రమ ఆయుధాల రవాణా ముఠాలతో నివేశ్​కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

ఇదీ చూడండి:

'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్​'

Last Updated :Jan 13, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.