ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి..

author img

By

Published : Aug 2, 2022, 5:30 PM IST

woman suicide in madhya pradesh

భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రభుత్వ అధికారిణి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది.

మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ కార్యాలయంలో పని చేస్తున్న 27 ఏళ్ల మహిళా అధికారి ప్రాణాలను బలితీసుకుంది. మేనేజర్​గా పనిచేస్తున్న రేఖాశర్మ.. తన నివాస భవనం ఐదో అంతస్తు నుంచి దూకింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియదని.. ఘటనా స్థలంలో సూసైడ్​ నోట్​ లభించలేదని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రేఖ.. ఒత్తిడిలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ఇవీ చదవండి:

జావలో పడి మరణించిన భక్తుడు.. ఏసీ పేలి మరో వ్యక్తి..

'మంకీపాక్స్​పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్​పైనా ముందడుగు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.