ETV Bharat / bharat

వైసీపీ నాలుగున్నరేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 3:28 PM IST

Updated : Nov 2, 2023, 3:47 PM IST

MP Raghurama Pil in High Court
MP Raghurama Pil in High Court

15:22 November 02

సీఎం జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషన్‌

MP Raghu Rama Krishnam Raju Files Pil In High Court: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ.. హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిల్‌ లో పేర్కొన్నారు. సీఎం జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వెల్లడించారు. సీఎస్‌ సహా పలువురు ఐఏఎస్‌ల నిష్క్రియాపరత్వాన్ని తన పిల్‌లో ప్రస్తావించారు. సాక్షి పత్రిక, ఛానెల్‌కు లబ్ధి కలిగేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు. వివిధ శాఖలో జరిగిన అవినీతిపై విపులంగా పిటిషన్‌లో ప్రస్తావించారు.

Last Updated :Nov 2, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.