ETV Bharat / bharat

విద్యార్థినిపై ఇద్దరు సహచర బాలురు అత్యాచారం!

author img

By

Published : Jan 27, 2022, 8:19 AM IST

Minor Rape Case: బాలికను ఆమె చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు బాలురు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని డూంగర్​పుర్​లో జరిగింది.

gang raped in Rajasthan
అత్యాచారం

Minor Rape Case: రాజస్థాన్​ డూంగర్​పుర్​లో దారుణం జరిగింది. బాలికను ఆమె చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు బాలురు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు.

బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన ఇద్దరు బాలురు ఆమెను కిడ్నాప్ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశారు. సోమవారం ఈ ఘటన జరిగింది. మంగళవారం కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు నిందితులను గుర్తించినప్పటికీ.. వారిని అరెస్టు చేయలేదు.

అయితే.. బాధితురాలికి చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమె కోలుకోగానే మరింత సమాచారం సేకరించి నిందితులను అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్ శర్మ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: చిన్నారులపై పడిన ట్రక్కు- ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.