ETV Bharat / bharat

Minister Harishrao on Telangana Funds : 'విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులివ్వండి'

author img

By

Published : Jul 12, 2023, 8:02 AM IST

Minister HairshRao About Krishna Water : విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ఆర్థికమంత్రిని ప్రత్యేకంగా అడిగారు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను సమన్యాయంతో పంపిణీ చేసేందుకు కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రిని హరీశ్‌రావు కోరారు. ఏపీ సర్కార్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరంలో వివిధ విభాగాలను విస్తరిస్తోందని ఆయన వివరించారు.

Etv Bharat
Etv Bharat

మా నిధులు మాకివ్వండి... తెలంగాణకు సమన్యాయం చెయ్యండి

Minister Harishrao in GST Council Meeting : జీఎస్టీ వసూళ్లపై తెలంగాణకు పరిహారం కింద రూ.698.97 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. జీఎస్టీ బకాయిలు, ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసిన వాణిజ్య సంస్థల పన్ను చెల్లింపుల తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. వెనుకబడిన జిల్లాల నిధి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని... రూ.1,350కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్‌ సమస్య పరిష్కారానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు.

రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయండి : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను సమన్యాయంతో పంపిణీ చేసేందుకు కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. నిన్న రాత్రి దిల్లీలోని షెకావత్ నివాసానికి వెళ్లి కలిసిన హరీశ్‌రావు... రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నదీ జలాల వాటా, అనుమతులపై చర్చించారు. ‘కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారని.... కొత్త ట్రైబ్యునల్‌ పరిధిని కృష్ణా జలాల పంపిణీ వరకే పరిమితం చేయాలన్నారు. గోదావరి నదిపై సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు, కాళేశ్వరం మూడో టీఎంసీ, అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను కేంద్ర జల సంఘానికి పంపించామని... సాధ్యమైనంత త్వరగా వాటిని ఆమోదించాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు కేంద్ర మంత్రికి విన్నవించారు.

"సెక్షన్ 3కింద కృష్ణ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారికి చెప్పడం జరిగింది. గోదావరిలో మన ప్రాజెక్టు సంబంధించి సీడబ్ల్యూసీ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా క్లియరెన్స ఇవ్వాలని మాట్లడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి కూడా అన్ని క్లియరెన్స్ ఇవ్వాలని కోరాం. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని మాట్లాడం. పోలవరం ప్రాజెక్టు అవసరమున్న దానికంటే ఎడమ కాలువ, కుడి కాలువ అని తవ్వకాలు ఏపీ ప్రభుత్వం చేస్తుంది. రెండితల ప్రాజెక్టులను మూడింలు చేయడం వల్ల మా తెలంగాణ గోదావరి జలల్లో మా హక్కును కోల్పోతాం."-హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికమంత్రి

పోలవరం ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అనధికార నిర్మాణాలు నిలిపివేయించాలని జల్‌శక్తి మంత్రిని హరీశ్‌రావు కోరారు. ఏపీ సర్కార్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరంలో వివిధ విభాగాలను విస్తరిస్తోందని.. వరద నీరు వాడుకొనే పేరుతో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు. 493 టీఎంసీల నీటి కేటాయింపులు ఏపీకి ఉండగా.. దాదాపు 1500 టీఎంసీల సామర్థ్యాన్ని సృష్టించుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ హక్కులపై ఇది ప్రభావం చూపుతుందని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.