ETV Bharat / bharat

పదో తరగతిలో ఫెయిల్.. వ్యర్థాలతో సొంతంగా బైక్ తయారీ.. ఖర్చు రూ.10వేలే!

author img

By

Published : Dec 29, 2022, 10:54 PM IST

పదో తరగతి పాస్​ కాని ఓ యువకుడు బైక్​ తయారు చేశాడు. పనికిరాని వ్యర్థాలతో బైక్​ను రూపొందించాడు. ఆ యువకుడి విజయగాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Making a bike out of useless materials
పనికిరాని వస్తువులతో బైక్​ తయారు చేసిన యువకుడు

ఆ యువకుడు చదివింది పదో తరగతే. అది కూడా ఫెయిల్​ అయ్యాడు. అయితేనేం తన ప్రతిభతో ఓ బైక్​ను తయారు చేశాడు. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన సోహైల్​ ఫతే మహ్మద్​.

Maharashtra youth made bike with out of useless materials
సోహైల్​ ఫతే మహ్మద్ తయారు చేసిన బైక్​

వివరాల్లోకి వెళితే.. సోహైల్​ ఫతే మహ్మద్.. నాగ్​పుర్​కు చెందిన యువకుడు. పనికిరాని వస్తువులను, వ్యర్థాలను ఉపయోగించి ఓ బైక్​ తయారు చేశాడు. ఇందుకు కేవలం రూ.10 వేలను మాత్రమే ఖర్చు చేశాడు. 125 సీసీ ఇంజిన్​ సామర్థ్యంతో ఈ బైక్​ రూపొందించాడు. ఔరంగాబాద్‌లోని ఆమ్ ఖాస్ మైదానంలో జరిగిన బిజినెస్ ఎక్స్‌పోలో.. సోహైల్ తన బైక్‌ను ప్రదర్శించాడు. బైక్​లు అమ్మడం తన లక్ష్యం కాదని.. మంచి పెట్టుబడిదారు దొరికితే.. తన కలను సాకారం చేసుకుంటానని సోహైల్ చెబుతున్నాడు. తన తల్లి ప్రోత్సాహంతోనే ఇలా పనికిరాని వస్తువులతో బైక్​ను తయారు చేసినట్లు అతడు వివరించాడు.

Maharashtra youth made bike with out of useless materials
బైక్​తో సందర్శకులు
Maharashtra youth made bike with out of useless materials
బైక్​ గురించి వివరిస్తున్న సోహైల్​ ఫతే మహ్మద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.