ETV Bharat / bharat

కశ్మీర్​లో నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు పాకిస్థానీ!

author img

By

Published : Jun 19, 2022, 6:39 PM IST

Updated : Jun 19, 2022, 10:24 PM IST

KULGAM ENCOUNTER: జమ్ముకశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీ అని అధికారులు తేల్చారు.

kulgam encounter
కుల్గాం

KULGAM ENCOUNTER: జమ్ముకశ్మీర్​లో నలుగురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో వీరిని హతమార్చాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నారని అధికారులు తేల్చారు.

పక్కా సమాచారంతో..: షౌకత్ అహ్మద్ షేక్​ అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాలను చుట్టుముట్టారు. ముష్కరులు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్న పాకిస్థాన్ జాతీయులు అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.
మరోవైపు.. కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొరా ప్రాంతంలోనూ ఎన్​కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. కుప్వారా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరంతా అల్ బదర్ ముఠాకు చెందినవారని తెలిపారు. నిందితులను నజీం అహ్మద్ భట్, సిరాజ్ దిన్ ఖాన్, అదిల్ గుల్​గా గుర్తించారు.

ఇవీ చదవండి: హాస్టల్​ విద్యార్థినులపై.. స్కూల్​ ప్రిన్సిపాల్​ అఘాయిత్యం

అగ్నిపథ్​పై కాంగ్రెస్ సత్యాగ్రహం- ప్రభుత్వాన్ని కూల్చే కుట్రన్న భాజపా

Last Updated :Jun 19, 2022, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.