ETV Bharat / bharat

కేరళలో మళ్లీ కొవిడ్​ కల్లోలం- కొత్తగా 22 వేల కేసులు

author img

By

Published : Sep 16, 2021, 10:46 PM IST

దేశంలో కరోనా (Corona cases in India) కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో (Kerala COVID cases)కరోనా కేసులు మళ్లీ 22 వేల పైకి చేరాయి. మహారాష్ట్రలో 3500 మందికి కరోనా సోకింది.

Covid cases in India
భారత్​లో కరోనా కేసులు

దేశంలో కొవిడ్ కల్లోలం (Corona cases in India) కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళలో ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించిన కొవిడ్ ఉద్ధృతి మళ్లీ పెరిగింది. తాజాగా ఈ రాష్ట్రంలో 22,182 కరోనా (Kerala COVID cases) కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి 178 మంది బలయ్యారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మొత్తం 44,46,228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 23,165 మంది కరోనాతో మృతి చెందారు.

తాజాగా కేరళవ్యాప్తంగా 26,563 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 42,36,309కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,190 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..

  • మహారాష్ట్రలోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 3,595 కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. 3,240 మంది కొవిడ్​ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 49,342 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
  • కర్ణాటకలో కొత్తగా 1,108 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 809 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,174 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • తమిళనాడులో 1,693 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయింది. 25 మంది మహమ్మారి వల్ల మరణించారు. 1,548 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • రాజధాని నగరం దిల్లీలో మరో 28 మందికి కరోనా సోకింది. ఒకరు కరోనాతో మరణించారు. నగరంలో పాజిటివ్​ రేటు 0.04 శాతంగా ఉన్నట్లు హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది.

ఇదీ చదవండి: 'మద్యం కొనేవారిని 'పశువులు'గా చూడకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.