ETV Bharat / bharat

80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!

author img

By

Published : May 3, 2022, 1:45 PM IST

Bridge Theft In Bihar: వంతెనను ఎత్తుకెళ్లిన మరో ఘటన బిహార్​లోని బాంకా జిల్లాలో వెలుగు చూసింది. ఈసారి 80 అడుగుల బ్రిడ్జ్​ను దాదాపు 70 శాతం మేర మాయం చేశారు దుండగులు. ఇంత జరుగుతున్నా అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవటం గమనార్హం.

kanwariya Bridge Theft in Banka
వంతెన చోరీ

Bridge Theft In Bihar: బిహార్​లో దొంగలు మరోసారి తమ పనితనాన్ని చూపించారు. రోహ్తాస్​ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్​ను ఎత్తుకెళ్లిన ఘటన జరిగిన నెలరోజుల్లోనే మరో వంతెనను మాయం చేశారు. ఈసారి బాంకా జిల్లా చందన్​ బ్లాక్​లో జరిగింది. 2004 నాటి 80 అడుగుల ఐరన్​ బ్రిడ్జ్​ను గ్యాస్​ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది.

kanwariya Bridge Theft in Banka
చోరీకి గురైన వంతెన

ఝాఝా, పటనియా మధ్య ఉన్న వాగుపై 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. 1995లో భారీ వరదల సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రావణి జాతరలో ఝాఝా గ్రామం నుంచి పటనియా ధర్మశాలకు వెళ్లేందుకు ఊరేగింపు పెద్ద వాగులో నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పలువురు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్​ చేశారు. అప్పటి జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో వంతెన నిర్మించిన తర్వాత భక్తులు సులభంగా బాబా ధామ్​కు చేరుకోగలిగారు. అయితే, పుక్కా బ్రిడ్జ్​ సహా కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో దీనిని వినియోగించటం లేదు. దీంతో ఈ బ్రిడ్జ్​పై దొంగల కళ్లు పడ్డాయి.

kanwariya Bridge Theft in Banka
వంతెనపై ఇనుప షీట్లను ఎత్తుకెళ్లిన దొంగలు

వంతెన చోరీకి గురైనట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదన్నారు పోలీసు అధికారి నషీమ్​ ఖాన్​. ఈ విషయంపై విచారణ చేపడతామన్నారు.'ఈ బ్రిడ్జ్​ను రూ.46 లక్షలతో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. కొత్త వంతెన నిర్మించిన తర్వాత దాని వాడకం తగ్గింది. బ్రిడ్జ్​ చోరీ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.' అని తెలిపారు.

ఇదీ చూడండి: 60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. అధికారులు షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.