ఫుడ్​ డెలివరీ బాయ్​ దారుణ హత్య.. మద్యం వద్దన్నందుకు 9 మంది కలిసి..

author img

By

Published : Jul 30, 2022, 12:44 PM IST

Updated : Jul 30, 2022, 12:56 PM IST

Indore : Fఫుడ్​ డెలివరీ బాయ్​ దారుణ హత్య.. యువకుడ్ని కత్తితో పొడిచిన తొమ్మిది మంది..ood delivery boy stabbed while on his way to deliver food, later died

ఫుడ్​ డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్​ను దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడ్ని తొమ్మిది మంది యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు.

Food Delivery Boy Murder: మధ్యప్రదేశ్​లోని ఇందోర్​ జిల్లాలో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్​ను గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తితో పొడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. బాధితుడ్ని సునీల్​ వర్మగా పోలీసులు గుర్తించారు.

బాధితుడు సునీల్​ వర్మ
బాధితుడు సునీల్​ వర్మ

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడు సునీల్​ వర్మ(24) గ్రాడ్యుయేషన్​ పూర్తయ్యాక ఓ ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ కంపెనీలో విధులకు చేరాడు. గురువారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో కస్టమర్​కు ఫుడ్​ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కత్తితో దారుణంగా పొడిచారు. స్థానికులు.. బాధితుడ్ని అరబిందో ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్​వై ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం తీసుకెళ్లగా.. శుక్రవారం చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

యువకుడ్ని కత్తితో పొడిచిన తొమ్మిది మంది.. చిన్నవివాదంతో ఓ యువకుడిని.. తొమ్మిది మంది యువకులు కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడ్ని దీపక్​ గైక్వాడ్​గా పోలీసులు గుర్తించారు.

తొమ్మిది మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు
తొమ్మిది మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన కొంత మంది యువకులు.. రెండు గ్యాంగ్​లుగా ఏర్పడి వాకడ్​ ప్రాంతంలో మద్యం తాగడానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఓ గ్యాంగ్​లోని యువకుడు.. అదే బృందంలో ఉన్న దీపక్​ గైక్వాడ్​ను మద్యం, సిగరెట్​లు తీసుకురమ్మన్నాడు.ఆ సమయంలో మరో గ్యాంగ్​లోని యువకుడు.. ఆ మైనర్​ను మద్యం తీసుకురావొద్దని, బానిస కావొద్దని సలహా ఇచ్చాడు. దాంతో దీపక్​​ గ్యాంగ్​లోని మిగతా యువకులంతా కోపం తెచ్చుకుని.. మైనర్​కు సలహా ఇచ్చిన యువకుడ్ని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో మరో యువకుడు గాయపడగా.. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మైనర్ చిన్నారితో సహా తొమ్మిది మందిని వాకడ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వృద్ధుడిపై కనికరం లేకుండా..

వృద్ధుడిపై జవాన్​ దాడి

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​ రైల్వే స్టేషన్​లో ఓ వృద్ధుడిపై జవాన్​.. దాడి చేస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కనీసం కనికరం లేకుండా ఆ జవాన్..​ వృద్ధుడ్ని కాలితో తన్ని తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా బాధితుడ్ని ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపైకి తోసేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియోపై జీఆర్​పీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ

ఆన్​లైన్​లో ల్యాప్​టాప్​ ఆర్డర్​ చేసిన వ్యక్తికి షాక్​.. ఓపెన్ చేసి చూస్తే...

Last Updated :Jul 30, 2022, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.