భార్యను చంపి జైలుకు.. చేతిమీద 'ఐ లవ్​ యూ' అని రాసి సూసైడ్​!

author img

By

Published : May 10, 2022, 6:57 PM IST

odisha crime news

భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్టైన ఓ అండర్​ ట్రైయల్​ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి చేతితో ఐ లవ్​ యూ అని భార్య పేరు రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఒడిశాలోని సోహెలా జైలులో జరిగింది.

ఒడిశా బార్​గఢ్​లోని సోహెలా జైలులో ఓ అండర్​ట్రైయల్​ ఖైదీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి అరచేతిపై 'ఐ లవ్​ యూ మంజు' అని రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మంజు అతడి భార్య. చనిపోయిన అండర్​ట్రైయల్​ ఖైదీ.. పెటుపాలీ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మోహిత్ రౌత్. జైలులో అతడి శవం వేలాడుతూ ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసహజ డెత్​ కేసుగా పోలీసులు దీనిని నమోదు చేశారు.

వరకట్నం వివాదం కారణంగా భార్య మంజును హత్య చేశాడనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం మోహిత్​ను పోలీసులు అరెస్టు చేశారు. యాదృచ్ఛికంగా మంజు మృతదేహాన్ని రికవరీ చేసుకునే సమయంలో ఆమె చేతిపై 'ఐ లవ్​ యూ మోహిత్'​ అని రాసి ఉంది.

ఇదీ చూడండి: బెడ్​షీట్​పై 'పీరియడ్స్'​ మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్​ షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.