ETV Bharat / bharat

లోన్ ఎగ్గొట్టేందుకు భార్య హత్య.. మతిస్థిమితం లేని బాలికపై మైనర్ రేప్

author img

By

Published : Nov 26, 2022, 4:45 PM IST

తీసుకున్న లోన్​ చెల్లించాల్సి వస్తుందని భార్యని హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు మతిస్థిమితం లేని బాలికను ఓ మైనర్​ అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Husband killed his wife in Saharsa
Husband killed his wife in Saharsa

తీసుకున్న లోన్​ తిరిగి చెల్లించే అవసరం ఉండదన్న ఉద్దేశంతో భార్యనే కిరాతకంగా హత్య చేశాడో భర్త. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన బిహార్​లోని సహస్ర జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పత్​బిందా గ్రామానికి చెందిన ములాయం యాదవ్, లక్ష్మీదేవి ప్రేమించుకుని 8 ఏళ్ల క్రితం ఇంటర్​ కులాంతర వివాహం చేసుకున్నారు. పెద్ద వారికి ఇష్టం లేకపోయినా.. 8 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే డబ్బుల కోసం ములాయం తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో లక్ష్మీదేవి తన తల్లిని డబ్బులు సమకూర్చమని అడిగింది. అనంతరం లక్ష్మీదేవీ పేరుమీద తన తల్లి బ్యాంకులో లోన్​ ఇప్పించింది.

అయితే ఆ లోన్​ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భార్య చనిపోతే లోన్​ తిరిగి చెల్లించే అవసరం ఉండదని.. భావించాడు ములాయం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సర్దార్​ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడిని అరెస్టు చేశామని.. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

బాలికను రేప్​ చేసిన మైనర్..​
ఉత్తర్​ప్రదేశ్​లో మతిస్థిమితం లేని బాలికను ఓ మైనర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పొరుగింట్లో ఉండే ఓ బాలికపై మైనర్​ రేప్​ చేశాడు. బాలిక గర్భం దాల్చగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదీ జగిగింది..
షాజహాన్​పుర్​ జిల్లా ఖుడాగంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మతి స్థిమితంలేని బాలిక నివసిస్తోంది. పొరుగింట్లో ఉండే మైనర్ ఆమెపై తరచూ అత్యాచారం చేసేవాడు. దీంతో ఆమె నాలుగు నెలల గర్భవతి అయ్యింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియగా... వారు ఆమెను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అయితే ఆ బాలికకు మతిస్థిమితం సరిగా లేదని.. మూర్ఛ వ్యాధితో కూడా బాధపడుతోందని రూరల్ ఎస్పీ సంజీవ్ భాజ్​పాయ్​ చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అన్నారు. నిందితుడిపై అత్యాచారం కింద కేసునమోదు చేశామని వెల్లడించారు. తరుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ​

ఇవీ చదవండి : 'మతం మారి పెళ్లి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా'

''26/11' కుట్రదారులకు శిక్ష పడాల్సిందే.. అలా అయితేనే బాధితులకు న్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.