త్వరలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డాక్టర్లు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. చంబాలోని భర్మౌర్ స్థానానికి భాజపా తరఫున జనక్ రాజ్ అనే న్యూరోసర్జన్ పోటీ చేస్తున్నారు. అయితే తాము రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన వైద్య వృత్తిని మరువము అనేందుకు ఉదాహరణగా ఈ డాక్టర్ చేసిన ఓ పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
![BJP candidate Janak Raj seeing patients while on campaign trail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16774677_915_16774677_1667035569256.png)
శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్లా ప్రాంతంలో తిరుగుతున్న డాక్టర్ వద్దకు ఓ వృద్ధురాలు వచ్చారు. నడుము నొప్పితో బాధపడుతున్న ఆమె.. తనను పరీక్షించమని కోరారు. దీంతో మెడికల్ రిపోర్టులను పరిశీలించిన జనక్రాజ్.. జనసంద్రంలోనూ చీటీలో మందులు రాసి వృద్ధురాలికి ఇచ్చారు. సరైన వైద్య పరికరాలు లేనప్పటికీ రోగి నాడి తెలుసుకునేందుకు మొబైల్ను ఉపయోగించారు. ఆ తర్వాత ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు.
అయితే ఒకే దశలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది.
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 17
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ: నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబర్ 8
ఇదీ చదవండి: గార్డు మాట విని అడవిలోకి వెళ్లిపోయిన గజరాజు వీడియో చూశారా
పూజా ఏర్పాట్లలో మాజీ సీఎం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవ కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు