ETV Bharat / bharat

సైకిల్​ను ఢీకొట్టి.. అమ్మాయిని ఈడ్చుకెళ్లిన కారు.. అచ్చం దిల్లీ కేసులానే!

author img

By

Published : Jan 4, 2023, 5:01 PM IST

Updated : Jan 4, 2023, 5:22 PM IST

దిల్లీలో అంజలి అనే యువతిని కారు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. అలాంటి మరో ప్రమాదం వెలుగుచూసింది. ఈ ఘటన కూడా అదే రోజు జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.

kaushambi girl dragged under car
యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన

దిల్లీలో అంజలి అనే యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. అలాంటిదే మరో కేసు ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. వేగంగా వచ్చిన కారు ఓ విద్యార్థినిని ఢీకొట్టి.. దాదాపు 200 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటన కొత్త సంవత్సరం మొదటి రోజున జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2023 జనవరి 1న కౌశాంబీ జిల్లాలో దేవ్​కర్​పుర్​ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని.. కంప్యూటర్ క్లాసులకు సైకిల్​పై వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొంది. దీంతో బాలిక సైకిల్​తో పాటుగా కారు టైరు భాగంలో చిక్కుకుంది. అనంతరం కారు డ్రైవర్​ టైరులో చిక్కుకున్న బాలికను.. 200 మీటర్లపైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారు కూడా అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో బాలికకు ఓ కాలు, ఓ చేయి విరగగా.. ముఖం, ఛాతీ భాగాల్లో గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కారు అదుపు తప్పడం కారణంగా నిందితుడికీ గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Jan 4, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.