పార్లమెంట్​ ముందుకు ఆర్థిక సర్వే.. వృద్ధిరేటు అంచనా ఇలా..

author img

By

Published : Jan 31, 2023, 1:06 PM IST

Updated : Jan 31, 2023, 3:23 PM IST

economic survey 2023
economic survey 2023 ()

2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. వృద్ధిరేటును 6.5 శాతంగా సర్వే అంచనా వేసింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున్న ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపింది.

2022-2023 ఆర్థిక​ సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని తెలిపింది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు సహా మరికొన్ని అంతర్జాతీయ పరిణామాలతో రూపాయికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు :

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతం ఉండొచ్చు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 శాతం. 2021-22లో ఇది 8.7శాతంగా ఉంది.
  • ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. జీడీపీ వృద్ధి 6 నుంచి 6.8 శాతం ఉంటుంది.
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్​ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
  • ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. ఇది ప్రవేటు వివియోగాన్ని, పెట్టుబడులు బలహీనపరచలేదు.
  • కొనుగోలు శక్తి పరంగా భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ, ఎక్స్చేంజ్‌ రేటు పరంగా.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
  • కరోనా మహమ్మారి వ్యాప్తి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఐరోపాలో సంక్షోభం కారణంగా మందగించిన దేశ వృద్ధిరేటు.. మళ్లీ పుంజుకుంది.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయి.
  • పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.
  • దేశీయంగా వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి.
  • ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు రుణ వితరణను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా..
"ప్రపంచం మాదిరిగానే భారత్ కూడా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే సవాళ్లు ​ఎదుర్కొంది. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్నా.. చాలా ఆర్థిక వ్యవస్థల కన్నా భారత్​ దీటుగా నిలబడింది. ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేసిన మహమ్మారి ప్రభావం నుంచి త్వరగా కోలుకుంది. ఇది దేశీయంగా ఉన్న డిమాండ్​, పెట్టుబడుల కారణంగా సాధ్యపడింది. కానీ యూఎస్​ ఫెడ్​ వడ్డీ రేట్లు పెంచడం వల్ల రూపాయికి సవాళ్లు ఎదురయ్యాయి." అని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది.
ఇవీ చదవండి :

Last Updated :Jan 31, 2023, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.