ETV Bharat / bharat

పసిపాపను రూ.5వేలకు అమ్మేసిన తల్లి- ఆకలి బాధ తట్టుకోలేక..

author img

By

Published : Feb 2, 2022, 5:22 PM IST

Facing Poverty Mother Sells Newborn: పిల్లలకు సరైన తిండి అయినా పెట్టలేనంత పేదరికం.. ఇల్లు లేక రాత్రిళ్లు, శీతాకాలం చలిలోనే గజగజలాడుతూ గడపాల్సిన దుస్థితి.. శరీరాన్ని గుల్ల చేస్తున్న రోగానికి తగిన చికిత్స పొందలేని పరిస్థితి.. అన్నీ కలిసి ఓ తల్లి పేగు బంధం తెంచుకునేందుకు కారణమయ్యాయి. పసిబిడ్డను రూ.5వేలకు అమ్ముకునేలా చేశాయి.

Facing poverty, mother sells newborn
పసిపాపను రూ.5వేలకు అమ్మేసిన అమ్మ

Facing Poverty Mother Sells Newborn: పేదరికం తెచ్చిన కష్టాలను తట్టుకోలేని ఓ తల్లి.. పసిబిడ్డను రూ.5వేలకు అమ్ముకుంది. ఝార్ఖండ్​​ గుమ్లా జిల్లా అంబేడ్కర్​ నగర్​లో జరిగిందీ ఘటన.

ఆకలి.. అనారోగ్యం..

గుడియా దేవి- భజరంగ్ నాయక్​ దంపతులకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయి ఖుషీ కుమారి(13) బిహార్​లోని బిహ్తాలో ఇటుకల బట్టీలో పనిచేస్తోంది. మిగిలిన ముగ్గురు పిల్లల(అక్షయ్​(9), దీపావళి(3), నెలల వయసున్న పాప)తో కలిసి ఝార్ఖండ్​ గుమ్లా జిల్లా అంబేడ్కర్​ నగర్​లో ఉంటున్నారు గుడియా దేవి దంపతులు.

భజరంగ్​ నాయక్​ పాత సామాను సేకరించి, అమ్మితే వచ్చే సంపాదనే వారికి ఆధారం. తలదాచునేందుకు ఇల్లు కూడా లేదు. పాత సామాను భద్రపరిచే రేకుల షెడ్డే వారికి ఆధారం. గుడియా దేవి కుటుంబం చాలీచాలని తిండి తింటూ, శీతాకాలం చలిలో ఆరుబయటే నిద్రిస్తూ ప్రత్యక్ష నరకం చూసిన రోజులు ఎన్నో..

ఇవి చాలదన్నట్టు గుడియా దేవి కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానికులు కొందరు గుమ్లా సదర్ ఆస్పత్రిలో చేర్చగా.. ఆమెకు క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. కానీ.. చికిత్స పూర్తి కాకుండానే కొన్ని రోజులకే ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చిందామె.

.
.

ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎంతోకొంత డబ్బు కావాలని భావించిన భజరంగ్ నాయక్, గుడియా దేవి... నెలల వయసున్న పసి పాపను రూ.5వేలకు అమ్మేశారు. నిజానికి.. మూడో అమ్మాయి దీపావళిని గతేడాది దీపావళి పండుగ సమయంలోనే అమ్మేద్దామని చూశారు గుడియా-భజరంగ్. కానీ.. స్థానికులు అడ్డుకోగా వెనక్కు తగ్గారు. ఈసారి మాత్రం నాలుగో బిడ్డను వేరే వాళ్లకు విక్రయించేశారు.

రంగంలోకి అధికారులు..

పసిపాప విక్రయం గురించి తెలిసిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. గుడియా దేవి-భజరంగ్ నాయక్​ను కలిసి.. వారి పరిస్థితి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద ఆహార ధాన్యాలు, దుస్తులు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. అమ్మేసిన పసిబిడ్డను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: రూ. 30 కోసం కస్టమర్​ను కత్తెరతో పొడిచిన టైలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.