ఎయిర్​పోర్ట్​లో 62 కిలోల హెరాయిన్​ సీజ్​.. విలువ రూ.430 కోట్ల పైనే!

author img

By

Published : May 11, 2022, 5:25 PM IST

d

Drugs seized in delhi airport: దిల్లీ విమానాశ్రయంలో రూ.434 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 62 కిలోల ఈ హెరాయిన్​ను ఉగాండా నుంచి దుబాయ్​ మీదుగా భారత్​కు తరలించేందుకు నిందితులు యత్నించారని అధికారులు తెలిపారు. మరోవైపు మణిపుర్​లో కూడా హెరాయిన్​ తరలింపును అడ్డుకున్నారు అక్కడి అధికారులు.

Drugs seized in delhi airport: పంజాబ్​, గుజరాత్​లలో భారీగా మాదకద్రవ్యాలు​ పట్టుబడుతున్న నేపథ్యంలో దిల్లీలో ఎయిర్​పోర్ట్​లో డ్రగ్స్​ కలకలం సృష్టించాయి. ఆపరేషన్​ 'బ్లాక్​ & వైట్​' పేరుతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) నిర్వహించిన తనిఖీల్లో 62 కిలోల హెరాయిన్​ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్​ కార్గో నుంచి 55 కిలోలను సీజ్​ చేసిన అధికారులు నిందితుడి అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు మరో 7కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.434 కోట్లు అని వెల్లడించారు. ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి దుబాయ్​ మీదుగా వీటిని భారత్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

Drugs seized in delhi airpor
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​
Drugs seized in delhi airpor
కారులో పట్టుబడ్డ డ్రగ్స్​

మణిపుర్​లోనూ: సబ్బు పెట్టెల్లో హెరాయిన్​ తరలించేందుకు యత్నించిన నిందితులను మణిపుర్​ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 2.13 కిలోలు విలువ చేసే డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 212 సబ్బు పెట్టెల్లో నిందితులు వీటిని తరలించేందుకు యత్నించారని.. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.31.80 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు.. చురచాంద్​పుర్​ జిల్లాకు చెందిన సోన్​లైసీ హాకిప్​, జామ్​గౌలెన్​ హాకిప్​లుగా గుర్తించారు. వీరికి సహకరించిన ఓ హెడ్​కానిస్టేబుల్​ను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.