ETV Bharat / bharat

'ఒక్కరికి కరోనా సోకినా స్కూల్​ మొత్తం మూసేయాల్సిందే!'

author img

By

Published : Apr 15, 2022, 6:44 AM IST

పాఠశాలలో ఒక్కరికి కరోనా పాజిటివ్​ వచ్చినా.. ప్రాంగణమంతా తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది దిల్లీ ప్రభుత్వం. ఇటీవల నగరంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

delhi covid cases news
delhi covid cases today

Schools Shut: కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని పాఠశాలల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా.. పాఠశాల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది మాస్కులు, భౌతిక దూరం పాటించాలని దిల్లీ విద్యాశాఖ కోరింది. కొవిడ్​ కేసులు స్వల్పంగా పెరిగినా.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా అన్నారు.

దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గురువారం 325 మంది మహమ్మారి బారినపడ్డారు. సోమవారం నాటి కేసులతో పోలిస్తే 237% పెరుగుదల నమోదైంది. ఒక్క వారంలో పాజిటివిటీ రేటు 0.5% నుంచి 2.39%కి పెరిగింది. పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరిచిన నేపథ్యంలో జాతీయ రాజధాని ప్రాంత పరిధిలోని కొందరు పిల్లలు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడినట్లు వార్తలొస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వసంత్‌కుంజ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 మంది పిల్లలు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

ఇదీ చదవండి: 'రబ్బర్​ స్టాంప్' రాజకీయం! పంజాబ్​ అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.