ETV Bharat / bharat

'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 6:55 AM IST

Chandrababu Bail Petition Hearing Skill Development Case: రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి కానీ రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని.. బెయిలు మంజూరు చేయాలని కోరారు. స్కిల్‌ కేసులో గురువారం జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా పడింది.

Chandrababu_Bail_Petition_Hearing_Skill_Development_Case
Chandrababu_Bail_Petition_Hearing_Skill_Development_Case

Chandrababu Bail Petition Hearing Skill Development Case: 'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'

Chandrababu Bail Petition Hearing Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో గురువారం చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్‌ (Dammalapati Srinivas) ప్రతివాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ (CID) కనీస ప్రయత్నం చేయలేదని.. నిందితులంతా ఇప్పటికే బెయిలు పొందారని వాదించారు. ప్రాసిక్యూషన్‌ వాస్తవాలను చెప్పకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు.

35వ నిందితుడిగా ఉన్న జీవీఎస్‌ భాస్కర్‌కు హైకోర్టు బెయిలు నిరాకరించిందని మాత్రమే సీఐడీ చెబుతోందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుతోందన్నారు. కేసు దస్త్రాలన్నీ ఇప్పటికే సీఐడీ ఆధీనంలో ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని వాదించారు.

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్​ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు

సీఐడీ అదనపు కౌంటరులో.. సీమెన్స్‌ సంస్థ అంతర్గత నివేదిక గురించి ప్రస్తావించారు. సీమెన్స్‌ ఎండీ సుమన్‌బోస్, అరవింద్‌ చిన్నప్ప అనే వ్యక్తి మధ్య జరిగిన వాట్సప్‌ సందేశాల గురించి చెప్పారన్నారు. ఆ సంభాషణ 2014 అక్టోబరు నుంచి 2015 మార్చి మధ్య జరిగినట్లు స్పష్టమవుతోందన్నారు. అప్పటికి స్కిల్‌ ప్రాజెక్టు ప్రారంభమే కాలేదని.. సీమెన్స్‌ అంతర్గత నివేదికలో చంద్రబాబు పేరు, ఆయన పాత్ర ప్రస్తావనే లేదన్నారు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ (Andhra Pradesh State Skill Development Corporation)తో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ చెప్పినట్లు అదనపు ఏజీ అంటున్నారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు.. మరోవైపు డిజైన్‌టెక్‌ ద్వారా సీమెన్స్‌కు 92 కోట్లు అందినట్లు శరత్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ప్రస్తావించారన్నారు. స్కిల్‌ ప్రాజెక్టుపై తాము త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని, తక్కువ ధరకు సాఫ్ట్‌వేర్‌ అందజేశామని సీమెన్స్‌ సంస్థ ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్‌ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఎస్‌డీసీతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ చెప్పినట్లు సీఐడీ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. ఫోరెన్సిక్‌ నివేదికను లోపభూయిష్ఠంగా తయారుచేసిందున శరత్‌ అసోసియేట్స్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ ఖాన్విల్కర్‌ ఐసీఏఐకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుతో పిటిషనర్‌కు సంబంధం లేదని వాదించారు.

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ

నివేదికలు నమ్మశక్యంగా లేవు: ‘‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారని.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవన్నారు. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదంటూ వాదించారు.

ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలన్నారు. మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిలు ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదన్నారు. అందువల్ల బెయిలు పిటిషన్‌ను కొట్టేయాలి’’ అని కోరారు.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి - క్యాటరాక్ట్‌ చికిత్స చేసిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్య నిపుణులు

కోర్టును తప్పుదోవ పట్టించడమే: ‘షరతులను ఉల్లంఘిస్తూ చంద్రబాబు హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీ నిర్వహించారన్న సీఐడీ వాదన సరికాదన్నారు. హైదరాబాద్‌ బేగంపేట పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారనడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనని వాదించారు. చంద్రబాబుపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేయలేదన్నారు. 2019కి ముందు చంద్రబాబుపై ఒక్క కేసే పెండింగ్‌లో ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నెలన్నరలో ఆయనపై ఆరు కేసులు నమోదు చేసిందని వాదించారు. హత్యాయత్నం కేసు పెట్టడాన్నిబట్టే సీఐడీ, ప్రభుత్వ వ్యవహారశైలిని అర్థం చేసుకోవచ్చు.

బెయిలు మంజూరు విషయంలో కోర్టుముందున్న వివరాలు, వైద్యులు ఇచ్చిన వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్‌ పిటిషన్‌ రిజర్వులో ఉన్న కారణాన్ని చూపుతూ బెయిలు పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్న దర్యాప్తు సంస్థ వాదన సరికాదు’ అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాస్తవాలను దాచిపెట్టి ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని.. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు ఆయనపై బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.

Case on Chandrababu Naidu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.