ETV Bharat / bharat

పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం

author img

By

Published : Aug 6, 2022, 3:01 PM IST

Updated : Aug 6, 2022, 5:58 PM IST

Bihar Five labourers died when a fire broke out in their boat
Bihar Five labourers died when a fire broke out in their boat

14:58 August 06

పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం

బోటులో చెలరేగిన మంటలు

Labourers Died: బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్​ దియరా ఘాట్​ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. సోన్​ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్​ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ పడవలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యాస్​ సిలిండర్​ లీకై ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే.. పడవలో సిలిండర్​ తీసుకెళ్లడం నిషేధం.

Last Updated :Aug 6, 2022, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.