Bihar Alcohol News: బిహార్ నలంద జిల్లాలో ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమని మృతుల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
చనిపోయినవారంతా సోహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామానికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమనే అంశంపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: హాస్టల్లో ఒకేసారి 50మంది విద్యార్థులకు అస్వస్థత- ఏమైంది?