'కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి!'

author img

By

Published : Jan 15, 2022, 11:13 AM IST

Suspicious deaths in Nalanda

Bihar Alcohol News: మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బిహార్​లో మరోమారు కల్తీ మద్యం కలకలం రేపింది. నలంద జిల్లాలో ఐదుగురు మరణించగా.. ఇందుకు విషపూరితమైన మద్యం తాగడమే కారణమని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Bihar Alcohol News: బిహార్​ నలంద జిల్లాలో ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమని మృతుల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

చనిపోయినవారంతా సోహ్​సరాయ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో కొండ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామానికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమనే అంశంపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.

Bihar alcohol news
కల్తీ మద్యంతో ఐదుగురు మృతి!
Bihar alcohol news
కల్తీ మద్యంతోనే మృతి చెందారని ఆరోపిస్తున్న స్థానికులు
బిహార్​లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే.. అనేక చోట్ల కల్తీ మద్యం వ్యాపారం జోరుగా జరుగుతూ ఉండగా.. పలువురు మరణిస్తున్న వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.
Bihar alcohol news
దర్యాప్తులో పోలీసులు..

ఇదీ చదవండి: హాస్టల్​లో ఒకేసారి 50మంది విద్యార్థులకు అస్వస్థత- ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.