ETV Bharat / bharat

భారత్​లో 24 గంటల్లో 103 మంది మృతి

author img

By

Published : May 8, 2020, 8:53 AM IST

Updated : May 8, 2020, 9:23 AM IST

corona death toll in india rises to 1886
మహారాష్ట్రలో 694 మంది మృతి...

09:13 May 08

corona news
దేశంలో కరోనా వివరాలు

మహారాష్ట్రలో 694 మంది మృతి...

గడిచిన 24 గంటల్లోనే భారత్​లో 103 కరోనా మరణాలు సంభవించాయి. మరో 3390 మందికి వైరస్​ సోకింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 56 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించింది.  

మహారాష్ట్రలో మృతుల సంఖ్య 694కు చేరింది. రాష్ట్రంలో 17 వేల 974 మంది కరోనా బారినపడ్డారు. మరో 3 వేల మందికిపైగా కోలుకున్నారు.  

గుజరాత్​లో ఇప్పటివరకు 425 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్​లో 193, రాజస్థాన్​లో 97, దిల్లీలో 66 మంది మరణించారు.  

08:52 May 08

దేశంలో 1886కు పెరిగిన కరోనా మరణాలు

భారత్​లో కరోనా కేసులు 56 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో మరో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3390 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 56342
  • యాక్టివ్ కేసులు      : 37916
  • మరణాలు            : 1886
  • కోలుకున్నవారు     : 16539
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated :May 8, 2020, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.