ETV Bharat / bharat

ఇంట్లో బంగారు నిధి, గుట్టుగా పంచుకున్న కూలీలు, తప్పతాగి నోరుజారేసరికి

author img

By

Published : Aug 29, 2022, 10:27 PM IST

పాత ఇంటిని పునర్​నిర్మిస్తుండగా బాంగారు నాణేలు బయటపడ్డాయి. యజమానికి తెలియకుండా కూలీలు బంగారాన్ని పంచుకున్నారు. వాటి విలువ రూ.కోటి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Antique Gold Coins Found In MP
antique gold coins found near old hosue reconstruction site in Madhya Pradesh

పాడుబడిన ఇంటిని తిరిగి నిర్మిస్తుండగా.. పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు బయటపడ్డాయి. అయితే యజమానికి తెలియకుండా కూలీలు ఆ బంగారాన్ని గుట్టుగా పంచుకున్నారు. కానీ తాగిన మైకంలో ఓ వ్యక్తి నోరుజారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగింది. అదనపు ఎస్పీ దేవేంద్ర పటిదార్‌ వివరాల ప్రకారం..

ధార్‌లోని ఓ పురాతన ఇంటిని కూల్చి అక్కడ కొత్త ఇంటిని నిర్మించేందుకు యజమాని కొందరు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిలోని కొంతభాగాన్ని కూల్చి శిథిలాలను తరలిస్తుండగా.. ఆ కూలీలకు బంగారంతో కూడిన లోహపు పాత్ర లభించింది. అందులో పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని వారు బయటకు పొక్కనీయలేదు. యజమానికి తెలియకుండా ఆ ఎనిమిది మంది పంచుకున్నారు.

ఇలా బయటపడింది..
కాగా వారిలో ఓ కూలీ తాజాగా నాణేన్ని అమ్మేశాడు. వచ్చిన రూ.56వేలతో కొన్ని సరకులు, ఓ ఫోన్‌ కొనుక్కున్నాడు. ఆపై ఫూటుగా తాగి, ఆ మైకంలో తమకు దొరికిన బంగారు నిధి గురించి మిత్రులకు చెప్పాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కూలీలందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నాణేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొంటుండగా.. పురావస్తు శాఖకు చెందిన అధికారులు మాత్రం రూ.1.25కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి: వారసులకు పెద్దపీట, ఈశాకు రిలయన్స్ రిటైల్, అనంత్​కు న్యూ ఎనర్జీ

ఈ గణేశుడు చాలా రిచ్, మండపానికి రూ.316 కోట్లతో ఇన్సూరెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.