యువకుడి హత్య.. రాళ్లతో నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు

author img

By

Published : Jun 23, 2022, 11:33 AM IST

people killed two criminals

అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో ఓ యువకుడిని కాల్చిచంపారు నలుగురు దుండగులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు వారిలో ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని గఢ్​వా జిల్లాలో జరిగింది.

నకిలీ పత్రాలు సృష్టించి గ్రామస్థులను వేధిస్తున్నారు నలుగురు వ్యక్తులు. దీనిని అడ్డుకున్న ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు వారిలో ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

గఢ్​వా జిల్లాకేంద్రానికి సమీపంలోని సుఖ్బానా గ్రామంలో కొందరు దుండగులు.. నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని ఖాళీ చేయాలంటూ గ్రామస్థులను వేధించేవారు. ఇది గమనించిన విమల్​ సింగ్​ అనే యువకుడు వారు చేస్తున్న అరాచకాలను అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే విమల్​ను చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు. బుధవారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న కాలువ వద్ద నిల్చున్న విమల్​ను శ్యామ్​రాజ్​, సంతోశ్​ చంద్రవంశీ, కృష్ణ పాశ్వాన్​, భిక్షు పాశ్వాన్​లు వచ్చి తుపాకీతో కాల్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల రాంచీ రిమ్స్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగపడ్డారు. వీరిలో సంతోశ్​ చంద్రవంశీ, కృష్ణ పాశ్వాన్​లు గ్రామస్థులకు దొరికిపోయారు. కొపోద్రిక్తులైన గ్రామస్థులు వారిని రాళ్లతో కొట్టి చంపారు.

ఇదీ చదవండి: బాలుడిని కాటేసిన విషసర్పం.. క్షణాల్లోనే ఆ పాము మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.