ETV Bharat / bharat

బీచ్​లో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి

author img

By

Published : Feb 4, 2022, 10:47 AM IST

Updated : Feb 4, 2022, 11:40 AM IST

Four girls drowned: సరదాగా బీచ్​లో వాకింగ్​కు వెళ్లిన ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సముద్రంలో అలల ధాటికి నలుగురు అమ్మాయిలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

4 GIRLS DROWNED IN DAMAN SEA
బీచ్​లో వాకింగ్​కు వెళ్లి ఒకే కుంటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి

Four girls drowned: కేంద్రపాలిత ప్రాంతం దమ్​న్​ దీవ్​లోని దమన్​ నగరంలో విషాద ఘటన జరిగింది. జంపోర్ బీచ్​లో సరదాగా వాకింగ్​కు వెళ్లిన ఓ కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు సముద్రంలో మునిగి చనిపోయారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ కుటుంబం దమన్​లో బంధువుల ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులందరూ సరదగా బీచ్​కు వెళ్లారు. అయితే ఐదుగురు అమ్మాయిలు సముద్రంలోకి దిగిన తర్వాత భారీ అలలు వచ్చాయి. దీంతో వారు నీటమునిగారు. కుటుంబసభ్యులు కాపాడేందుకు ప్రయత్నించారు. ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగతా నలుగురు నీట మునిగి చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు అమ్మాయిల్లో ఒకరు ఉత్తర్​ప్రదేశ్ నుంచి వచ్చారు.

4 GIRLS DROWNED IN DAMAN SEA
సముద్రంలో మునిగి మరణించిన అమ్మాయి మృతదేహం

Girls drowned in daman sea

తమకు సాయం చేయాలని అరుపులు, కేకలు వేసినా ఒక్కరు కూడా ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్​లో పోలీసులే లేరని పేర్కొన్నారు. వాటర్ బోట్లు నడిపే ఏజెన్సీని సాయం కోరినా వారు కూడా స్పందించలేదని చెప్పారు. బీచ్​లో సైన్​ బోర్డు గానీ, హెల్ప్​లైన్ నంబర్ గానీ లేదని వాపోయారు.

4 GIRLS DROWNED IN DAMAN SEA
బీచ్​లో వాకింగ్​కు వెళ్లి ఒకే కుంటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

4 GIRLS DROWNED IN DAMAN SEA
బీచ్​లో వాకింగ్​కు వెళ్లి ఒకే కుంటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి

ఇదీ చదవండి: అటవీ అధికారిపై చిరుత దాడి.. లైవ్​ వీడియో

Last Updated : Feb 4, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.