హోరాహోరీగా వాలీబాల్ పోటీలు- విజేత జట్టుకు రూ.లక్ష బహుమతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:31 PM IST

thumbnail

Volleyball Competitions Organized By Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న వాలీబాల్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. క్రీడాకారులకు గుర్తింపు తెచ్చేందుకే నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త నందం అబద్దయ్య అన్నారు. ఈ పోటీల్లో మొత్తం 58 జట్లు పోటీ పడగా 570 మంది క్రీడాకారులు లీగ్-3 పోటీలలో పాల్గొన్నారు.

నగరంలోని నారా లోకేశ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలో దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన మన్నం అశోక్ యూత్ జట్టు విజయం సాధించి రూ.లక్ష నగదును, ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన ఈమని జట్టుకు లక్ష రూపాయల బహుమతిని అబద్దయ్య అందించారు. ద్వితీయ స్థానం సాధించిన మంగళగిరికి చెందిన బాప్టిస్ట్‌పేట వాలీబాల్ యూత్ జూనియర్స్ జట్టుకు రూ.50 వేలు, తృతీయ స్థానం సాధించిన బీజేఆర్​ జట్టుకు రూ.25 వేలు నగదు బహుమతిని  గెలుచుకున్నాయి. టీడీపీ-జనసేన నేతలు పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టుకు లోకేశ్ సహకారంతో వాలీబాల్ కిట్లు, టీషర్ట్స్‌ను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.