భాగ్యనగరానికి ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం - ట్రాఫిక్​ సమస్యలు మళ్లీ షురూ ! - Voters Return Journey to Hyderabad

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 6:03 PM IST

thumbnail
భాగ్యనగరానికి ఏపీ ఓటర్ల తిరుగు ప్రయాణం- ట్రాఫిక్​ సమస్యలు మళ్లీ షురూ! (ETV Bharat)

Traffic Problems Started Again Voters Return Journey from AP to Hyderabad : ఎన్టీఆర్ జిల్లా నందిగామ-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మళ్లీ రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్​ జాతీయ రహదారిపై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద హైవే విస్తరణ పనులు జరుగుతుండటంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఓటర్లు  శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుని శని, ఆదివారాల్లో ఇక్కడే ఉండి సోమవారం ఓటేసి తిరిగి హైదరాబాద్​కు బయలుదేరారు. ఈ సారి ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్ల వరుసలతో బార్లు తీరారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. సాయంత్రం ఐదు గంటలకు సుమారు 68 శాతం పోలింగ్​ నమోదైంది. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో వేచి ఉన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.