ఓట్ల కోసం శ్రీరాముణ్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు : జగ్గారెడ్డి - lok sabha elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 3:58 PM IST

thumbnail
()

Jaggareddy fires on BJP : కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మాదిరిగా దొంగ వాగ్దానాలు చేయదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించవద్దని, కాంగ్రెస్ గొప్పతనం గురించి చెప్పకపోతే చరిత్ర హీనులవుతారని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనుద్దేశించి అన్నారు. చరిత్ర అంటే మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాహుల్ గాంధీలదని వివరించారు.

నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం, ఐడీపీఎల్‌, ఎన్టీపీసీ, విద్యుత్ రంగం, బీహెచ్‌ఈఎల్‌ లాంటి పరిశ్రమలను తీసుకువచ్చారని వివరించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం శ్రీరామ చంద్రున్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. నేడు దేశంలో బీజేపీ అసమర్థతను ఏ ఒక్క న్యూస్‌పేపర్‌లోనూ, టీవీ ఛానళ్లలోనూ చూపించడానికి భయపడుతున్నారని దుయ్యబట్టారు. త్వరలో మోదీ పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.