విశాఖ తీరానికి విలాసవంతమైన 'ది వరల్డ్​' నౌక - సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం - International Cruise Ship

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 10:28 AM IST

thumbnail

International Cruise Ship Arrived at Visakhapatnam Port : విశాఖ సాగర తీరానికి మరో విశిష్ట అతిథి విచ్చేసింది. 'ది వరల్డ్​' అనే అంతర్జాతీయ క్రూయిజ్​ నౌక తొలిసారిగా విశాఖ పోర్డుకు చేరుకుంది. క్రూయిజ్​ నౌకలో సుమారు 80 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు పోర్టు అధికారులు ఘన స్వాగతం పలికారు. నౌకలో వచ్చిన విదేశీయులు స్థానిక కళాకారులతో సంప్రదాయ నృత్యాలు చేశారు. 'ది వరల్డ్​ ' నౌకలో వచ్చిన విదేశీయులకు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను తిలకించనున్నారు. సోమవారం రాత్రి విశాఖ పోర్టు నుంచి పోర్ట్ బ్లేయిర్ కు ది వరల్డ్ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక బయలుదేరుతుంది. దీనిని చూడడానికి విశాఖవాసులు భారీ సంఖ్యలో పోర్టుకు తరలివచ్చారు.

విలాసవంతమైన ' ది వరల్డ్​ క్రూయిజ్​ నౌక విశాఖ పోర్టులోని అంతర్జాతీయ క్రూయిజ్​ టెర్మినల్లో బెర్తింగ్​ అయ్యిందని పోర్టు ఛైర్మన్​ అంగముత్తు పేర్కొన్నారు. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్​ను గమ్యస్థానంగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ టెర్మినల్​ను రూ.96 కోట్లతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన క్రూయిజ్ నౌకల రాకపోకలకు అనువుగా నిర్మించామని అంగముత్తు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.