హైవేపై వరుసగా ఢీకొన్న కార్లు- ప్రయాణికులు సేఫ్ - Road Accident in NTR District

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 1:29 PM IST

thumbnail
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం- హైవేపై వరుసగా ఢీకొన్న నాలుగు కార్లు (ETV Bharat)

Road Accident in NTR District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో ఒకదాని వెనుక మరొకటిగా నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్​ వైపు వేగంగా వెళ్తున్న నాలుగు వాహనాలలో ముందున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Palnadu Road Accident: మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం-పసుమర్రు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్​ను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి, గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కళ్లు తెరిచి ఏం జరుగుతుందో చూసే లోపే అగ్నికీలలకు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలవ్వటంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.