పవన్​ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు- పిఠాపురంలో జనసేనాని గెలుపు తధ్యం: వర్మ - Pawan kalyan met varma

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 10:15 PM IST

thumbnail

TDP Leader Varma fire on YSRCP Leaders : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఉగాది వేడుకల్లో  జనసేన అ‍ధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్లొన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పిఠాపురం నుంచి పవన్​ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీడియా సమావేశంలో వర్మ తెలిపారు. పిఠాపురంలో ప్రతి మండలానికి ఆసుపత్రి, టెంపుల్ టూరిజానికి 500 కోట్లు, ఎస్ఈజెడ్​లో 30 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు, పవన్ ఎం చేస్తారో చెప్పి ఓట్లను అభ్యర్థిస్తున్నామని వర్మ అన్నారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత, ఆ పార్టీ నేత దొర బాబు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును ఆపేశారని, ఏలేరు ఆదునీకీకరణ పనులు పక్కన పెట్టారని వర్మ  ఆరోపించారు. దీంతో పిఠాపురం రైతులకు 6 వందల కోట్ల నష్టం జరిగిందని మండిపడ్డారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీళ్లను తాండవకు తరలించేదుకు 750 కోట్లకు వంగా గీత, దొర బాబు కాంట్రాక్టు ఇచ్చారని, అందులో 25 కోట్ల కమిషన్‌కు ఆ ప్రాజెక్టుకు సంతకం పెట్టి పిఠాపురం రైతుల హక్కులు తాకట్టుపెట్టారని, తమ ప్రాంతానికి రావల్సిన నీటిని మళ్లించారని ఆరోపించారు. పవన్​ను ఓడించేందుకు కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారని, వైసీపీ నేతలు ఎంతమంది వచ్చిన పవన్​ను గెలిపించుకుంటామని వర్మ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.