LIVE : కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష - Minister Ponnam live
Published : Apr 14, 2024, 12:17 PM IST
|Updated : Apr 14, 2024, 12:22 PM IST
Minister Ponnam Live : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో కమలం పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే, ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు.కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులకు పదేళ్లు ఏం చేశాయి? అని పొన్నం నిలదీశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా కరీంనగర్ ఇందిరాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది.