అప్పు చెల్లించలేదని రూ. 4 కోట్ల ఖరీదైన కారును తగులపెట్టిన దుండగులు - fire set on Lamborghini car

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 6:01 PM IST

thumbnail

fire set on Lamborghini car in Hyderabad : తీసుకున్న అప్పు ఇవ్వలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన పహాడి షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగింది. నార్సింగ్‌ చెందిన వ్యాపారి నీరజ్‌కు రూ.4 కోట్ల విలువ చేసే లంబోర్ఘని స్పోర్ట్స్​ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానాని అయాన్​కు చెప్పాడు. మోఘల్​పురాకు చెందిన అమన్​కు అయాన్ ఈ విషయం చెప్పాడు. అమన్ మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్ అనే వ్యకి కారు కొంటానని, మామిడిపల్లిలోని తన ఫామ్ హౌస్​కు తీసుకుని రావాలని అయాన్​కు చెప్పాడు.  

నీరజ్ వద్ద నుంచి కారు తీసుకొని అయాన్ మామిడిపల్లి సమీపంలోకి తీసుకొచ్చాడు. కారు ఓనర్ నీరజ్ ఎక్కడంటూ అతను తనకు రూ. 2 కోట్లు అప్పు ఇవ్వాల్సి ఉందని హంగామా చేస్తూ అహ్మద్ అతనితో పాటు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.