ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం - గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు చేసినట్లు ప్రకటన

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 4:48 PM IST

Updated : Feb 19, 2024, 5:33 PM IST

TSPSC Group 1 Notification Details
TSPSC Group 1 Notification Cancel

TSPSC Group 1 Notification Cancel : గ్రూప్-1 నోటిఫికేషన్​ను​ రద్దు చేస్తూ టీఎస్​పీఎస్సీ వెబ్ ​నోట్​ జారీ చేసింది. గతంలో పేపర్​ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్​ రద్దు చేయగా, రెండోసారి నిర్వహించిన పరీక్షను కూడా తాజాగా రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్​ను ఏప్రిల్​ 2022లో 503 పోస్టులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

TSPSC Group 1 Notification Cancel : గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్​పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు వెబ్‌ నోటీసును విడుదల చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌(TSPSC Group 1) వెలువడింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్‌ 11న రెండోసారి పరీక్షను నిర్వహించింది. దాదాపు 2 లక్షల 33 వేల మంది రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు, తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

TSPSC Group 1 Extra Posts
TSPSC Group 1 Notification Cancel

గ్రూప్​-1పై కీలక అడుగులు - సుప్రీంలో అప్పీలు ఉపసంహరణకు టీఎస్​పీఎస్సీ పిటిషన్‌

TSPSC Group 1 Issue : ఈ అంశంపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్‌ బెంచ్‌ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో టీఎస్​పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది. ఈ లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది. దీంతో టీఎస్​పీఎస్సీ(TSPSC) ప్రక్షాళనపై కొత్త సర్కార్‌ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు రాజీనామా చేశారు. దానికి గవర్నర్​ ఆమోదముద్ర వేశారు.

గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

TSPSC Group 1 Extra Posts : టీఎస్​పీఎస్సీ సభ్యులను నియమించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసి నియామకం చేపట్టింది. కొత్త ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్‌ను టీఎస్​పీఎస్సీ వెనక్కి తీసుకుంది. అనంతరం, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత నోటిఫికేషన్‌లో రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష సైతం రద్దైన తరుణంలో నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

Last Updated :Feb 19, 2024, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.