ETV Bharat / state

గవర్నర్​ ప్రసంగానికి శాసనసభ ఆమోదం - రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:09 PM IST

Updated : Feb 9, 2024, 8:06 PM IST

Telangana Assembly
Telangana Assembly Approved Governor Speech

Telangana Assembly Approved Governor Speech : గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపి, సభను రేపటికి వాయిదా వేసింది. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Telangana Assembly Approved Governor Speech : గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసససభను స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ రేపటికి వాయిదా వేశారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(TS Budget)​ను ప్రవేశపెట్టనుంది. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్​ను మంత్రివర్గం ఆమోదించనుంది.

శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా ఉదయం గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముందుగా ఎమ్మెల్యే వేముల వీరేశం తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి సభలో బలపరిచారు. అనంతరం సభలో సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ వాడీవేడీ చర్చలు జరిగాయి. తెలుగుజాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(Bharat Ratna PV Narasimha Rao)కు భారతరత్న రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, సభలోని సభ్యులు ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సభను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. విపక్ష నేతల ప్రశ్నలకు, రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రసంగాన్ని సాగించారు. బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly Sessions 2024 : ముందుగా బీఆర్​ఎస్​ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీకు అండగా నిలిచిందని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్​ఎస్​ మద్దతు పలికిందన్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్​ మీకు కొన్ని చెబుతారు, కొన్ని దాస్తారంటూ బీఆర్​ఎస్​ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్​ఎస్​, బీజేపీది ఫెవికాల్​ సంబంధమన్నారు.

నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, జెరాక్స్​ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం తాము కాదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. ఈ ప్రభుత్వం 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే గ్రూప్​ -1 నోటిఫికేషన్(Group 1 Notification)​ ఇస్తామని, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నామని పేర్కొన్నారు.

CM Revanth Reddy Fires on BRS : మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదని సభలో చెప్పారు. శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకునేలా అంగీకరించారన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం వైఖరి వల్లే, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. వెంటనే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మైక్​ అందుకుంటూ నాగార్జునసాగర్​ను వెంటనే మన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా ప్రాజెక్టు ఔట్​లెట్లను కేఆర్​ఎంబీకి నెలరోజుల్లో అప్పగిస్తామని సంతకాలు చేశారన్నారు. కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తి చొప్పున కేటాయించాలని తాము పోరాడామని హరీశ్​ రావు సభలో తెలిపారు.

గవర్నర్‌తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

Last Updated :Feb 9, 2024, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.