ETV Bharat / state

ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి - అనకాపల్లి, రాజమహేంద్రవరంలో ప్రధాని సభలు - modi election campaign in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 7:50 AM IST

Modi Election Campaign in AP
Modi Election Campaign in AP (Etv Bharat)

Modi Election Campaign in Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్​లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం రాజమహేంద్రవరం వేమగిరి వద్ద సభలో, సాయంత్రం అనకాపల్లి సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీతో పాటు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్ పాల్గొననున్న ఈ సభకి 2 లక్షల మంది జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపశమనానికి సభాప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి - అనకాపల్లి, రాజమహేంద్రవరంలో ప్రధాని సభలు (Etv Bharat)

Modi Election Campaign in Andhra Pradesh: రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి నేడు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా, వీటికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. గోదావరి తీరంలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభకు కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానితో పవన్ కల్యాణ్​, లోకేశ్ ఈ సభలో పాల్గొనున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే మరో సభలో ప్రధాని మోదీతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు.

ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతున్న వేళ గోదావరి తీరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడిన తర్వాత తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో బహిరంగ సభ నిర్వహించారు.

రెండో సభను రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం గతేడాది మహానాడు నిర్వహించిన మైదాన ప్రాంగణంలో సుమారు 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను సభలో ప్రధాని మోదీ వివరించనున్నారని నేతలు తెలిపారు. ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సభా ప్రాంగణంలో భారీ వేదికల చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉంచారు.

ఎన్నికల వేళ అయోధ్యకు మోదీ- రామయ్య దర్శనం- భారీ రోడ్​ షో - lok sabha election 2024

సభకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది తరలి రానున్నారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా లోపాలు తలెత్తడం, పలువురు ఉన్నతాధికారులపై వేటు పడటంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 2 వేల 347 మంది పోలీసులను ప్రధాని సభ భద్రత కోసం కేటాయించారు. జాతీయ రహదారికి పక్కనే ప్రధాని సభ నిర్వహిస్తుండటంతో ఆ మార్గంలో వేరే వాహనాలు రాకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

అనకాపల్లి సభలో ప్రధానితో కలిసి పాల్గొననున్న చంద్రబాబు : మూడు గంటల 45 నిమిషాలకు రాజమహేంద్రవరంలో సభ ముగిసిన తర్వాత అనకాపల్లికి ప్రధాని పయనమవుతారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలసి ప్రధాని మరో సభలో పాల్గొననున్నారు.

'పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది' - ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మోదీ హామీ - Narendra Modi Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.