ETV Bharat / state

యాదాద్రి థర్మల్​ పవర్​ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 12:58 PM IST

Updated : Feb 24, 2024, 2:22 PM IST

Ministers Inspected Yadadri Thermal Plant
Ministers Inspected Yadadri Thermal Plant

Ministers Inspected Yadadri Thermal Plant : యాదాద్రి థర్మల్​ పవర్​ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు నల్గొండ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం పర్యటించింది. దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రులు పరిశీలించారు.

Ministers Inspected Yadadri Thermal Plant : యాదాద్రి థర్మల్​ పవర్​ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈ పవర్​ ప్రాజెక్టు జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం విద్యుత్​ కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ముందుగా హెలికాప్టర్​లో దామరచర్ల మండలం వీర్లపాలెం చేరుకున్న నేతలు, ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న యాదాద్రి సూపర్​ క్రిటికల్​ అల్ట్రా థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని సందర్శించారు.

గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను, పద్ధతులను మార్చుకుని త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యాదాద్రి పవర్​ ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్​ పవర్​, రెనేవబుల్​ ఎనర్జీ వైపు వెళుతుంటే గత పాలకులు మాత్రం థర్మల్​ పవర్​ వైపు దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్​ఈఎల్​ త్వరగా పూర్తి చేయకపోతే సంస్థకు చెడ్డ పేరు వస్తోందని హితవు పలికారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్​

Ministers Nalgonda District Tour : అంతకు ముందు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు జెన్​కో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్లాంట్‌లో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉందని మంత్రులు అధికారులను ప్రశ్నించారు. బొగ్గును తరలించడానికి రైల్వే ట్రాక్ నిర్మాణం పురోగతి, గతంలో చేసిన పనుల్లో బిల్లుల చెల్లింపుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు, ఇంకా ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి ఉందనే తదితర అంశాలపై అధికారులను మంత్రులు ఆరా తీశారు.

మరోవైపు ఒక్కోటి 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేసే 4,000ల మెగా వాట్ల సామర్థ్యం గల 5 యూనిట్లలో ఈ ఏడాది ఆఖరిలోగా రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తామని జెన్‌కో సీఎండీ రిజ్వీ తెలిపారు. ఇటీవలే కేంద్రం పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ నెల 20న యాదాద్రి థర్మల్ ప్లాంట్‌(Yadadri Thermal Plant) ​పై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటికే థర్మల్​ ప్లాంట్​ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్​ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

నీటి పారుదల శాఖ పునర్​ వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు - మరో ప్రత్యేక కార్యదర్శి నియామకం

Yadadri thermal power plant: యాదాద్రి వెలిగేదెప్పుడో.. నత్తనడకన థర్మల్ విద్యుత్​ కేంద్రం పనులు

Last Updated :Feb 24, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.