ETV Bharat / state

దిల్లీలో ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ సమావేశం - ప్రోటోకాల్​ ప్రణాళికపై చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 8:03 PM IST

KRMB Meeting Latest Meeting Details
Krishna River Management Board Meeting in Delhi

Krishna River Management Board Meeting in Delhi : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్​, నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ల ప్రోటోకాల్స్​ నియమించేందుకు దిల్లీలో గురువారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగునుంది. ఈ మీటింగ్​లో ఔట్ లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా అవసరమైన ప్రోటోకాల్స్​పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Krishna River Management Board Meeting in Delhi : నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, సంబంధిత కాంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఖరారు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీలో ఈ నెల 17వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ(Central Water Resources Department) కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరగనుంది.

సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీకి కేఆర్​ఎంబీ గ్రీన్​సిగ్నల్

KRMB Meeting on Projects Protocols AP and TS : రెండు ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన 15 ప్రాధాన్యతా ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు అవసరమైన ప్రోటోకాల్స్​ను బోర్డు, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు ఖరారు చేయాలని దిల్లీ సమావేశం మినిట్స్​లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కృష్ణా బోర్డు ఛైర్మన్ గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఔట్ లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా అవసరమైన ప్రోటోకాల్స్​పై చర్చించి ఖరారు చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విషయమై సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్​ చీఫ్​లకు కృష్ణా బోర్డు(KRMB) సమాచారం ఇచ్చింది.

Krishna River Management Board
మరోసారి దిల్లీలో ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ సమావేశం

కృష్ణా యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ - ఏపీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు

KRMB Last Meeting in Delhi : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన ప్రాధాన్యంగా గుర్తించిన 15 కాంపోనెంట్లు, ఔట్‌లెట్లను నెల రోజుల్లోగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. ఈ నెల 17న దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో మినిట్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

సాగర్ డ్యామ్ ఘటన - తెలంగాణ అభ్యర్థనతో జలశక్తి శాఖ కీలక భేటీ వాయిదా

KRMB Last Meeting on Sagar Dam : నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar Dam) వద్ద కేంద్ర బలగాలు సీఆర్పీఎఫ్ పోలీసుల పటిష్ఠ నిఘా కొనసాగించాలని, బోర్డు అనుమతి తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఇంజినీర్లు, అధికారులను డ్యాం సైట్ వద్దకు అనుమతించాలని కేంద్ర రిజర్వు బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాగర్‌కు ముఖ్యమైన మరమ్మతుల పనులు తమ వైపు చేపట్టేందుకు రెండు రాష్ట్రాలకు బోర్డు అనుమతించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకు వెంటనే నిధులను విడుదల చేస్తాయని మినిట్స్‌లో వెల్లడించారు. ఈ సమావేశం పూర్తి సమాచారం తెలుసుకోవాంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.